మణిపూర్ రాష్ట్రంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకున్నాయి.
ఉఖ్రుల్ జిల్లాలో మొత్తం 21 అక్రమ బంకర్లను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో సికిబుంగ్ గ్రామంలో 14 బంకర్లు, మోంగ్కాట్ చెపు ప్రాంతంలో 7 బంకర్లు నేలమట్టం చేశారు.
ఇక టెంగ్నౌపాల్ జిల్లాలో మరో ప్రత్యేక ఆపరేషన్లో స్థానిక పోలీసులు 13 ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైజ్లు (IEDs) స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments