e-paper
Thursday, January 29, 2026

కుటుంబ సభ్యులను పరామర్శించిన కొండేటి మల్లయ్య

నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తల కుటుంబాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ కొండేటి మల్లయ్య పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన వీరమైన పిచ్చయ్య గారి కుటుంబానికి ₹5,000, కాసాని అశోక్ గౌడ్ కుటుంబానికి ₹10,000, చిగుర్ల సైదులు కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం అందించారు. మరణించిన కార్యకర్తల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతరెడ్డి సైదిరెడ్డి, మాజీ సర్పంచ్ బొడ్డ యాదయ్య, కనేకల్ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కొండేటి శంకర్, సీనియర్ నాయకులు పగిళ్ల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ అయోధ్య లింగస్వామి, మోహన్ కడారి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

— ✍️ చీకటి వెలుగు న్యూస్, నల్గొండ


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!