నల్గొండ, నవంబర్ 1
నల్గొండ శివాజీ నగర్ మునిసిపల్ పార్క్ సమీపంలోని పంకిన్ పాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ లో శనివారం రోజు హ్యాపీ హాలోవీన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ ఉరీనా సుల్తానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు, వారికి ఆటలు, పాటల ద్వారా ఒత్తిడి రహిత వాతావరణం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సహాయపడతాయని పేర్కొన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీయడం, “లెర్నింగ్ బై డూయింగ్” నినాదంతో మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ వేడుకలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం సందడి, రంగుల హర్షాతిరేక వాతావరణంలో సాగింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments