నల్లగొండ పట్టణంలో శ్రీ హరి హర అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది.
హైదరాబాద్ రోడ్డులోని వివేకానంద స్వామి విగ్రహం సమీపంలో ఉన్న దాత సముద్రాల శ్రీనివాసరావు నివాసంలో ఈ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి నోముల శ్యామ్ సమక్షంలో వేదపండితుడు మహేష్కుమార్ శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
మహోత్సవంలో భాగంగా మహా అభిషేకాలు, కలశపూజ, పల్లకీసేవ వంటి ప్రత్యేక ఆచారాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు, అయ్యప్ప స్వాములకు తీర్థప్రసాదం మరియు అన్నప్రసాదం పంపిణీ చేశారు. వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి పరవశంతో స్వామిని దర్శించారు.
ఈ కార్యక్రమం దాత సముద్రాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించబడగా, నవీన్ పిలెగురుస్వామి, మేడం విశ్వప్రసాద్, కలశం అశోక్ గురుస్వామి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, రావిరాల వెంకటేశ్వర్లు, బుర్రి చైతన్య, రావుల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మూర్తి, డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments