e-paper
Thursday, October 30, 2025
spot_imgspot_imgspot_img

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం — మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విపరీతంగా ధాన్యం చేరిందని, అయినప్పటికీ కొనుగోలు మందగమనంగా సాగుతుందని, ఇంకా అనేక కేంద్రాలు కొనుగోలు ప్రారంభించలేదని తెలిపారు.

వర్షాల సమయంలో రైతులు ధాన్యాన్ని రక్షించుకునేలా టార్పాలిన్‌లు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడంలో అధికారులు నిబంధనలు పాటించడం లేదని, 40.600 కిలోల బదులు 41.600 కిలోలుగా తూకం వేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా, ముందుగా వచ్చిన రైతులకు ముందు కాటా వేయకుండా సిఫారసుల ఆధారంగా అనుచిత ప్రవర్తన జరుగుతోందని అన్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో కూడా జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి పరిస్థితుల వలన రైతులు ప్రైవేట్ మిల్లర్లకు క్వింటాల్‌కు ₹1500కే అమ్మకానికి వుతున్నారని భూపాల్ రెడ్డి అన్నారు.

జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా, ఎటువంటి అక్రమాలు లేకుండా రైతులకు న్యాయం జరగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

మిల్లర్లు సన్నధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ₹500 బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా గత రెండు పంటల బకాయి బోనస్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

లేదంటే, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళనలు చేపడతామని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ప్రకటనలో హెచ్చరించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!