నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తిప్పర్తి మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు వంగూరి రవి ఆధ్వర్యంలో జరిగింది.
నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా “ఆపరేషన్ సింధూరం” ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు
సైన్యాన్ని, దేశాన్ని అవమానించేలా ఉన్నాయని వంగూరి రవి తీవ్రంగా విమర్శించారు.
రేవంత్ రెడ్డి తక్షణమే దేశానికి, సైన్యానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గుండా వినయ్కుమార్, సీనియర్ నాయకులు వడ్డే శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు దేశోజ్ శివశంకర్, బూత్ అధ్యక్షులు తంగేళ్ల సాయికిరణ్ రెడ్డి, పాపసాని శివ, సంపత్, పంపటి బాలు, దొడ్డేని నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments