దేవరకొండ జామియాతుల్ ఉలేమా ప్రముఖ నేత, ప్రసిద్ధ ముస్లిం మత పెద్ద ముఫ్తి మొహమ్మద్ జావిద్ హుస్సేన్ ఖాస్మీ సాహేబ్ ఆకస్మిక మరణం ముస్లిం సమాజంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు కలిసి ముఫ్తీ సాహేబ్ భౌతిక దేహానికి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ గారు మాట్లాడుతూ —
ముఫ్తీ సాహేబ్ యొక్క సరళమైన జీవన శైలి, ఆధ్యాత్మిక సేవలు, సమాజ శాంతి–సౌభ్రాతృత్వం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. మతపరంగా, సామాజికంగా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ముఫ్తీ జావిద్ హుస్సేన్ ఖాస్మీ సాహేబ్ మరణం ముస్లిం సమాజానికి ఎంతో పెద్ద లోటని అన్నారు.
తరువాత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొని ముఫ్తీ సాహేబ్కు నివాళులర్పించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments