e-paper
Tuesday, October 28, 2025
spot_imgspot_imgspot_img

రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా డా. నాగం వర్షిత్ రెడ్డి – నల్లగొండ కలెక్టరేట్ వద్ద ధర్నా

నల్లగొండ జిల్లా – నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం

రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

2024 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రభుత్వం పెన్షన్ తప్ప ఇతర ప్రయోజనాలు ఇవ్వకపోవడంపై రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విరమణ పొందిన ఉద్యోగులకు తక్షణమే అన్ని పెండింగ్ బెనిఫిట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే గత 19 నెలల్లో ఉద్యోగ విరమణ పొందిన 17 మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ధర్నాకు భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి హాజరై రిటైర్డ్ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ, “జీవితాంతం ప్రభుత్వ సేవలో పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు కనీస ప్రయోజనాల కోసం ఇంత కష్టపడాల్సి వస్తోందంటే ఇది దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి” అని తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!