e-paper
Thursday, October 30, 2025
spot_imgspot_imgspot_img

భారీ వర్షాల నడుమ రైతుల పక్షాన కలెక్టర్ త్రిపాఠి కృషి 🌾

– ధాన్యం సెంటర్లను సందర్శించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు 

దేవరకొండ డివిజన్ పరిధిలోని గుర్రంపోడు, మల్లేపల్లి, దేవరకొండ మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, జేసీ శ్రీనివాస్ గారు, ఆర్డీవో రమణారెడ్డి గారు కలిసి పరిశీలించారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా గుర్రంపోడు మండలం చామ గ్రామంలోని బావి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ గారు, అక్కడి వరద నీటి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.

సెంటర్ ఆవరణలోకి వరద నీరు ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ధాన్యం కుప్పలు కొట్టుకుపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

– రైతుల భద్రత, ధాన్యం రక్షణకు కలెక్టర్ త్రిపాఠి కృషి 


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!