e-paper
Thursday, January 29, 2026

ధాన్యం తేమ 17% వచ్చేటట్లు ఆరబెట్టాలని రైతులకు కలెక్టర్ ఇళా త్రిపాఠి సూచనలు

వర్షాలు తగ్గిన నేపథ్యంలో ధాన్యం తేమ శాతం 17% వచ్చేలా రైతులు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని బాగా ఆరబెట్టాలని జిల్లా కలెక్టర్ ఇళా త్రిపాఠి సూచించారు. సరైన తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా అవసరమైన లారీలు, హమాలీలు, కొలత పరికరాలు సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులకు ఆదేశించారు.

గురువారం కలెక్టర్ నల్గొండ మండలం జి. చెన్నారం, చర్లపల్లి, దండెం పల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని పరిశీలించారు.

జి. చెన్నారం కేంద్రం వద్ద:

కేంద్రానికి వచ్చిన ధాన్యం, తేమ శాతం వివరాలను తెలుసుకున్నారు.

తేమ 17% ఉన్న కుప్పలను సీరియల్ నంబర్లకు సంబంధం లేకుండా తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు.

కొనుగోలు చేసిన ధాన్యం సంచులను టార్పాలిన్లతో కప్పి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మూమెంట్ రిజిస్టర్, రాక రిజిస్టర్ లను పరిశీలించారు లారీలు లేదా ఇతర సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు

చర్లపల్లి కేంద్రం వద్ద:

రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్—

“ధాన్యాన్ని రాశులుగా పోయకుండా, విప్పదీసి ఆరబెట్టాలి. అప్పుడు సరైన తేమ వస్తుంది” అన్నారు.

ఇక్కడ తేమ 17% ఉన్న కుప్పలు ఎక్కువగా ఉండటంతో,

ఈరోజే 10 లారీలను ఏర్పాటు చేసి వెంటనే మిల్లులకు పంపించాలని

పౌరసరఫరాల డీఎం గోపికృష్ణ కు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతిరోజూ ధాన్యం తేమశాతం పరీక్షించి, నాణ్యత వచ్చినకొద్దీ వెంటనే తరలించాలని సూచించారు.

దండెం పల్లి కేంద్రం వద్ద:

ధాన్యం నాణ్యత, తేమ శాతం, కొనుగోలు విధానం తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, డీఎస్ఓ వెంకటేష్, పౌరసరఫరాల డీఎం గోపికృష్ణ, తహసిల్దార్ పరశురామ్ తదితర అధికారులు ఉన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!