ePaper
Monday, March 2, 2026

చిలకలూరిపేటలో ఏసీబీ దాడులు.. రూ.24 వేల లంచంతో ఏఈ రెడ్ హ్యాండ్!

చిలకలూరిపేటలో ఏసీబీ దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం రేపాయి. పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (AE)గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చార్యులు, ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.24,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

గతంలో పూర్తైన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని కాంట్రాక్టర్ ఏఈను సంప్రదించగా, వాటిని పాస్ చేయాలంటే లంచం ఇవ్వాలని సత్యనారాయణ డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం సోమవారం పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో నగదు లావాదేవీ జరుగుతున్న సమయంలో ఏసీబీ బృందం దాడి చేసి, ఏఈ సత్యనారాయణను అదుపులోకి తీసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో చిలకలూరిపేటలో అవినీతి వ్యవహారాలపై చర్చ మొదలైంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!