హైదరాబాద్:
రాష్ట్రంలో చికెన్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320కు విక్రయమవుతుండగా, కోడిగుడ్డు ధర ఒక్కటి రూ.8కు చేరింది. ఇటీవల కొంత తగ్గిన ధరలు మళ్లీ పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమలో కొనసాగుతున్న ఒడిదుడుకులు, చలికాల ప్రభావంతో ఉత్పత్తి తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో ధరలు ఎగబాకినట్లు తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ, మేడారం జాతర వంటి వేడుకల కారణంగా చికెన్, గుడ్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని పౌల్ట్రీ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments