ఇటీవలి తుఫాను ప్రభావంతో మార్కెట్లలో రైతుల వోడ్లు కరాబ్ అవుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే రైస్, మక్క వంటి పంటల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలస్యం వల్ల రైతులు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బీజేవైఎం నాయకుడు చొక్కల్ల చరణ్ మాట్లాడుతూ — “తుఫాను కారణంగా రైతులు ఇప్పటికే నష్టపోయారు. ఇప్పుడు వోడ్లు కరాబ్ అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటల కొనుగోలు ప్రారంభించాలి. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అవుతాయి” అని హెచ్చరించారు.
— ✍️ చీకటి వెలుగు న్యూస్, నల్గొండ
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments