e-paper
Thursday, January 29, 2026

నల్గొండ: కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ సన్నాహక సమావేశం

నల్గొండ పట్టణంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నల్గొండ పట్టణం చాలా సంవత్సరాల తర్వాత కార్పొరేషన్‌గా మారడం శుభపరిణామమని, దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నేరుగా కార్పొరేషన్‌కు అందుతాయని తెలిపారు. ఈ నిధులు నల్గొండ పట్టణ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు.

గతంలో కేంద్రం నుంచి వచ్చిన అమృత్ పథకం నిధులతో అండర్‌గ్రౌండ్ వ్యవస్థ మెరుగుపడిందని, వీధిలైట్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్ర నిధులతోనే కొనసాగుతున్నాయని అన్నారు. అయితే గతంలో మున్సిపాలిటీని పాలించిన పాలక పక్షాలు పట్టణ అభివృద్ధిని విస్మరించి కమిషన్లకే పరిమితమయ్యాయని విమర్శించారు.

నల్గొండ పట్టణానికి ఇప్పటికీ సరైన స్మశానవాటికలు లేవని, కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పాలక పక్షాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బండారు ప్రసాద్, మాధగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, లోకనబోయిన రమణ ముదిరాజ్, కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, రావిరాల వెంకన్న, గుర్రం వెంకన్న, దాసరి సాయి, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకన్న, చింత ముత్యాలరావు, నీరజ, ఒంగోలు రాఖీ, మంగళపల్లి కిషన్, బిపంగి జగ్జీవన్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!