యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లక్కారం చెరువు నిండిపోవడంతో నీరు ఊరా చెరువులోకి చేరి, చెరువు బండపై పగుళ్లు ఏర్పడ్డాయి. జిల్లా కలెక్టర్ హనుమంతరావు తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
ఈ పరిశీలనలో ఆర్డిఓ, కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి, ఇరిగేషన్ డీఏఈ, మున్సిపల్ ఏఈ, సాటిస్పెక్టర్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అధికారులు చెరువు పరిసరాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “అవసరమైన జాగ్రత్త చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేసి తగిన చర్యలు తీసుకునేలా సూచిస్తాము. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పని చేస్తున్నాయి,” అని తెలిపారు.
స్థానిక ప్రజలు అధికారులు ప్రత్యక్షంగా పరిశీలనకు రావడంతో సమస్య త్వరగా పరిష్కారమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments