ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిను అక్రమ ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు.
శాంతి నివాసంలో సుమారు 10 గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా బంగారం మరియు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సోదాల అనంతరం శాంతిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తాడేపల్లి నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments