e-paper
Thursday, January 29, 2026

అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలు సాధించాలి. .

భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలను నేటితరం విద్యార్థులు యువకులు సాధించాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ కోరారు. అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం మిర్యాలగూడ రోడ్డు లోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ఘనంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ పాల్గొని అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. విద్యతోనే అన్ని సాధించవచ్చు అని విద్య ప్రాధాన్యతను వివరించారన్నారు. రాజకీయవేత్తగా సాహితీవేత్తగా అబ్దుల్ కలాం అనేక సేవలు అందించారన్నారు.ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. సమావేశంలో ప్రిన్సిపల్ కొత్తజూల్ కుబ్రా.టీఎస్ మీసా అధ్యక్షుడు డాక్టర్ ఏ ఏ ఖాన్. మైనార్టీ నాయకులు కలీం. జాఫర్, జియాజుద్దీన్, ముని ఫ్ పాఠశాలపాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!