కాంగ్రెస్కు గుడ్బై… టీఆర్ఎస్లోకి షేక్ జహంగీర్ బాబా
నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కట్టర్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, గుమ్ముల మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు షేక్ జహంగీర్ బాబాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి 30వ వార్డు టికెట్ కేటాయించబడింది.
2016 నుంచి కాంగ్రెస్ పార్టీలో NSUI జాయింట్ సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే 2018–2023 కాలంలో 30వ వార్డు బూత్ ఇంచార్జ్గా పనిచేసిన షేక్ జహంగీర్ బాబా, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో షాక్కు గురైన ఆయన, పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఎన్నికల సమయంలో కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా, పార్టీ మారినవారికే కార్పొరేటర్ టికెట్ కేటాయించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
30వ వార్డులో ఎమ్మెల్యే ప్రచారానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాకుండా అడ్డుకున్న నాయకుడికే టికెట్ ఇవ్వడంపై కూడా షేక్ జహంగీర్ బాబా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాలను గమనించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, వెంటనే టీఆర్ఎస్ పార్టీ తరఫున షేక్ జహంగీర్ బాబాకు టికెట్ కేటాయించారు.
ఇప్పటికే టీఆర్ఎస్ కండువా కప్పుకున్న జహంగీర్ బాబా, మరికాసేపట్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన నివాసానికి వచ్చి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments