e-paper
Wednesday, January 28, 2026

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వి. నరేందర్ నాయీ

హైదరాబాద్:

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం చిక్కడపల్లి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం వద్ద నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వి. నరేందర్ నాయీ జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చిక్కడపల్లి కళ్యాణ మండపం అభివృద్ధి కోసం 20 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీకి

అధ్యక్షుడిగా: కంది సూర్యనారాయణ సభ్యులుగా: టి. జగదీష్ నాయీ, సతీష్ నాయీ, జి. శ్రీనివాస్ నాయీ, స్వాగత్ మల్లేష్ నాయీ, జె. మనోహర్ నాయీ, ఏ. రాజేందర్ నాయీ, శ్రీనివాస్ నాయీ, ఆనంతయ్య నాయీ, సంతోష్ కుమార్ నాయీ, మహేందర్ నాయీ, యాదగిరి నాయీ, తిరుపతయ్య నాయీ, దేశాయి శ్రీనివాస్ నాయీ, చంద్రకాంత్ నాయీ, నారు నాయీ, సత్యం కానుగుల రాకేష్ నాయీ, కరుణాకర్ నాయీ, రాఘవేంద్ర నాయీ తదితరులను ఎన్నుకున్నారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు డి.వి. నరేందర్ నాయీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!