లండన్ | అంతర్జాతీయ వార్తలు:
బ్రిటన్లోని అతిపెద్ద విమానాశ్రయం హీత్రో ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు కీలక సౌలభ్యం కల్పించింది. భద్రతా తనిఖీల సమయంలో ఇకపై రెండు లీటర్ల వరకు ఉన్న ద్రవాలను బ్యాగుల్లోనే ఉంచుకుని వెళ్లే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇప్పటివరకు భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులు ద్రవాలను చిన్న కంటైనర్లలో వేరు చేసి చూపించాల్సి ఉండేది. అయితే, ఆధునిక సీటీ స్కానింగ్ టెక్నాలజీ అమలులోకి రావడంతో ఈ నిబంధనలో మార్పులు తీసుకువచ్చారు. దీని వల్ల ప్రయాణికులకు భద్రతా తనిఖీల సమయంలో సమయం ఆదా అవుతుందని, ప్రయాణం మరింత సులభమవుతుందని అధికారులు తెలిపారు.
ఈ మార్పుతో హీత్రో ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీలు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని, ప్రయాణికుల అనుభవం మరింత మెరుగుపడుతుందని విమానాశ్రయ యాజమాన్యం పేర్కొంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments