తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంలో భాగంగా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో మహిళా సంఘాల కోసం వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం చౌటుప్పల్లోని బీఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మరియు చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, 591 మహిళా సంఘాలకు రూ.1,28,11,337/- వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా, 450 సంఘాలకు మొత్తం రూ.33,25,00,000/- విలువైన రుణాలను వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందించినట్లు వెల్లడించారు. ఈ రుణాలు మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, డైరెక్టర్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ఓ అంజయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, టీఎంసీ కవిత, ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments