నల్లగొండ :
ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్లో బుధవారం ఆయుర్వేదం,హోమియో, యూనాని ఆద్వర్యంలో పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. యునాని, ఆయుష్, ఆయుర్వేదిక్ సెంటర్ ప్రాంతాలలో పిచ్చి మొక్కలను తొలగించారు. చెత్తా చెదారం తీసివేసి శుభ్ర పరిచారు. అనంతరం ఆయా విభాగాల ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ నరసింహారావు,సీనియర్ మెడికల్ ఆఫీసర్ సుహాసిని మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడం ద్వార రోగులకు ఆరోగ్యం,ఆహ్లాదం అందించవచ్చన్నారు. నాటిన మొక్కను సంరక్షించాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్టుమెంట్ డీపీఎం కె. కళ్యాణ్, డాక్టర్ రుచిత , వైద్య సిబ్బంది విజయలక్ష్మి, మెర్సీ, యోగ శిక్షకులు సింగం ప్రవీణ్, జ్యోతి, శివ, మంజునాథ్, శ్రీ వాణి, కో మల, వైష్ణవి, సక్కుబాయి పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments