ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి
నల్గొండ:
విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ సంజీవ్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

మంగళవారం నల్గొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను శాశ్వతీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఆర్టిజన్ల గ్రేడ్ సమస్య చాలా కాలంగా పెండింగ్లో ఉందని, దాన్ని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై సంస్థ ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా హామీలే తప్ప పరిష్కారం లభించలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏదైనా సరే కార్మికుల హక్కుల కోసం పోరాడతామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కంపెనీ కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఎంవి రాఘవ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు జే. అమర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నిరంజన్ అలీ, కోశాధికారి హరిప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మీ రెడ్డి, నీలం ఐలేష్, కే. శ్రీనివాస్, అబ్దుల్ మజీద్, మహేందర్ రెడ్డి, మాధవరావు, సాయిబాబా, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments