e-paper
Thursday, January 29, 2026

ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు గుర్తింపు

నల్లగొండ:

తల్లిదండ్రులతో జరిగిన చిన్నపాటి వివాదం కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన తొమ్మిదో తరగతి విద్యార్థి మణీశ్వర్‌ను నల్లగొండ టూ టౌన్ పోలీసులు గుర్తించారు. బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సైదులు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో చూసుకోవాలని, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!