యూనివర్సల్ చర్చి వ్యవస్థాపకుడు రెవరెండ్ ఎం. రవి కుమార్ మరియు మచిలీపట్నం కు చెందిన షారాజ్యోతి గ్రేస్ పార్ల చెప్పారు, “ప్రపంచమంతా ఐక్యమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్.” పట్టణంలోని శాంతినగర్ సువార్త నిలయంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహించగా, వారు కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సందేశం అందించారు.
క్రిస్మస్ వేడుకల సందర్భంగా నల్లగొండ నియోజకవర్గంలోని వంద మంది వితంతువులకి క్రిస్మస్ కానుకగా చీరలు పంపిణీ చేయబడ్డాయి. కార్యక్రమంలో క్రిస్మస్ గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరిగాయి. యూనివర్సల్ చర్చి సంఘ పెద్దలు సిహెచ్ ప్రభాకర్, ఎం. రాములు, దుబ్బా అనిల్, నరేష్, జీవన్, విజయ్ కుమార్, అలాగే సండే స్కూల్ విద్యార్థులు మరియు మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments