— మల్లం మహేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా 17వ మహాసభలను నవంబర్ 20, 21 తేదీల్లో తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాము అని జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఇలా పేర్కొన్నారు:
డివైఎఫ్ఐ దేశభక్తి భావాలతో దేశ సమైక్యత, సమగ్రత కోసం 46 ఏళ్లుగా పోరాటాలు చేస్తోంది. “మా దేహం ముక్కలైనా, దేశం ముక్కలు కానీయం” అన్న భావంతో ఎన్నో త్యాగాలు చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగం పెరిగింది, యువతను మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్యోగాలపై చర్చ లేకుండా కాలం గడుపుతోంది. మహాసభలో భవిష్యత్తు కర్తవ్యాలు, పోరాటాల రూపకల్పనపై చర్చ జరుగుతుంది. దాదాపు 400 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
యువతి-యువకులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎం. రవినాయక్ (జిల్లా అధ్యక్షులు), పతని శ్రీను, పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments