e-paper
Thursday, January 29, 2026

కాషీ దేవ దీపావళి — లక్షల దీపాలతో ప్రకాశించిన పుణ్యనగరం!

బాబా విశ్వనాథుని పుణ్యనగరం వారణాసి ఈ రాత్రి అపూర్వమైన ప్రకాశంతో మెరిసిపోయింది. పవిత్ర గంగా తీరంలోని కాశీ ఘాట్లపై లక్షలాది దీపాలు వెలుగుతూ స్వర్గానుభూతిని కలిగించాయి. దేవ దీపావళి సందర్భంగా భక్తులు గంగా స్నానం చేసి, శ్రీ విశ్వనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గంగా తీరంలోని దశాశ్వమేధ్, అస్సి, మణికర్ణిక ఘాట్లలో వెలిగిన దీపాల తళుకులు భక్తుల మనసులను మంత్రముగ్ధం చేశాయి. దేశం నలుమూలల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా వేలాదిమంది పర్యాటకులు ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు.

భక్తులు దేవ దీపావళి సందర్భంగా అందరికీ సుఖసమృద్ధులు కలగాలని ప్రార్థనలు చేశారు. “హర్ హర్ మహాదేవ్” నినాదాలతో కాశీ నగరం మారుమ్రోగింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!