నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, వర్రె వెంకటేశ్వర్లు మరియు సదరుత్సవ సమితి అధ్యక్షుడు మద్ది శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా సదరును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. హర్యానా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన గోల్టు, బజరంగి దున్నల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి యువకులు తమ దున్నపోతులను ఊరేగిస్తూ ఉత్సాహంగా ఎన్జీ కాలేజ్ గ్రౌండ్కి తీసుకువచ్చారు. యాదవుల దరువులు, దున్న రాజుల ఆటలతో మొత్తం ప్రాంతం మారుమోగిపోయింది.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ట్రస్ట్ చైర్మన్ కె. చీర పంకజ్ యాదవ్, గుండెబోయిన లింగయ్య యాదవ్, ఏడుకొండలు యాదవ్, జాన్ అయ్యా యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, సుంకరబోయిన శివకుమార్ యాదవ్, పెద్దవాడి వెంకన్న యాదవ్, నాగరాజు యాదవ్, రఘు యాదవ్, లింగయ్య యాదవ్, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments