e-paper
Saturday, November 1, 2025
spot_imgspot_imgspot_img

నల్లగొండ యాదవ సంఘం భవన్‌లో సదర్ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

నల్లగొండ, అక్టోబర్ 31 (చీకటి వెలుగు):

రాబోయే నవంబర్ 2, 2025 ఆదివారం న నల్లగొండ ఎన్‌జీ కాలేజ్ మైదానంలో జరగనున్న యాదవుల సదర్ సమ్మేళనం సందర్భంగా, యాదవుల సదర్ ఉత్సవ సమితి అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్ యాదవ సంఘం భవన్‌లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు చెప్పారు कि — దున్నపోతులను అందంగా అలంకరించి యువకులు కుస్తీ ఆడటం ఈ పండుగలో ముఖ్యమైన ఆచారం అని తెలిపారు. యాదవ సోదరులు అందరూ ఐక్యంగా, కుల మత రాజకీయాలకతీతంగా అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సదర్ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా హర్యానా నుండి తెప్పించిన దున్నరాజులు — పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న గోల్ టూ, భజరంగి, షేహెంషా, కోహినూర్ ఉండనున్నాయి. వీటి ఎత్తు 6.5 అడుగులు, బరువు దాదాపు 2000 కిలోల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, సలహాదారులు గుండెబోయిన లింగయ్య యాదవ్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, అల్లి చంద్రయ్య యాదవ్, చల్లా కోటేష్ యాదవ్, నాగరాజు యాదవ్, సుంకరబోయిన శివ యాదవ్, గుండెబోయిన రఘు యాదవ్, కుంటిగొర్ల లింగయ్య యాదవ్, బొడ్డు సాయి యాదవ్, మొదాల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!