కెన్యాలో మంగళవారం ఉదయం జరిగిన భయానక విమాన ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. డయానీ నుంచి కిచ్వా టెంబోకు బయలుదేరిన చిన్న విమానం, క్వాలే కౌంటీ పరిధిలో కొద్దిసేపటిలోనే కుప్పకూలింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, ప్రాణాలతో బయటపడ్డ వారు ఎవరూ లేరు. ఈ దారుణ ఘటనతో దేశం అంతా విషాదంలో మునిగిపోయింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments