ఘనంగా ఆర్య సమాజ్ శోభాయాత్ర
విజయదశమి సందర్భంగా ఆర్య సమాజ్ మందిరం ఆధ్వర్యంలో పాతబస్తిలోని ఆర్య సమాజ్ లో యజ్ఞము నిర్వహించారు. అనంతరం ఖడ్గదారి పాదూరు శ్రీనివాసరెడ్డి కి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఖడ్గాన్ని అందజేశారు. అనంతరం కర్ర స్వాములు, కోలాటాలు, నృత్యాలతో ఊరేగింపు పాతబస్తీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, క్లాక్ టవర్, రామగిరి మీదుగా ఆర్య సమాజ్ చేరుకున్నారు. అనంతరం శోభాయాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, షాపల్లి రవి ప్రసాద్, ఎర్రమద లక్ష్మీనర్స్, జోష్ణ, కటికం సత్తయ్య, జంజిరాల నాగరాజు, జొన్నలగడ్డ శశిరేఖ, పండిత్ విశ్వామిత్ర తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments