ధూప దీప నైవేద్య అర్చక సంఘం.. ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అర్చక చైతన్య యాత్రలో భాగంగా..
నేడు నల్లగొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అర్చకులు.. రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు,. దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారి ఆధ్వర్యంలో.. పెద్ద ఎత్తునఅర్చక చైతన్య యాత్ర పేరుతొ ర్యాలీ నిర్వహించి… దేవాలయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ గారికి వినతిపత్రం సమర్పించారు.
అంతకుముందు టీఎన్జీవో భవన్ లో.. జిల్లా DDN అధ్యక్షులు పగిడిమర్రి ప్రసాద్ శర్మ అధ్యక్షుతన జరిగిన సమావేశంలో… రాష్ట్ర అధ్యక్షులు దౌలతబాద్ వాసుదేవ శర్మ మాట్లాడుతూ… ధూపదీప నైవేద్య అర్చకులు. చాలిచాలని వేతనాలతో ఉద్యోగ బద్రత లేకుండా..కనీసం వైద్య ఖర్చులు కూడా లేకుండా.. దయనీయమైన స్థితిలో ఉన్నారని… తెలియజేస్తూ.. దూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను 35000 లకు పెంచాలని.. హెల్త్ కార్డు ఇవ్వాలని.. అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని.. ప్రభుత్వాన్ని కోరారు… అదేవిదంగా పానగల్లులో… ప్రభుత్వం కేటాయించిన 25 గుంటల స్థలంలో అర్చక భవనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురు రమేష్… మాట్లాడుతూ… దూప దీప నైవేద్య అర్చకుల సమస్యలను.. జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామని .. మీ సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కార అయ్యే విధంగా.. తాము కృషి చేస్తామని తెలియజేశారు..
రామాలయం మాజీ చైర్మన్ ఆర్ ఎస్ ఎల్ ఎన్ శర్మ, అర్చక సంఘం గౌరవ అధ్యక్షులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ,వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నం బొట్లఫణికుమార్ శర్మ రాష్ట్ర కన్వీనర్ అమరేశ్వర్ శర్మ, చందోతి శివకుమార్, జిగురు లక్ష్మీ నరసింహమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామడుగు వెంకట రామశర్మ,చిట్యాల శ్రీనివాస్ శర్మ,
రామడుగు రామకృష్ణ శర్మ… తదితరులు పాల్గొన్నారు

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments