నల్గొండ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలో భాగంగా 6.5 కిలోల బరువున్న భారీ ట్యూమర్ను విజయవంతంగా తొలగించారు.
అడివదేవులపల్లికు చెందిన 55 ఏళ్ల సరోజ (పేరు మారింది) కొంతకాలంగా తీవ్రమైన కడుపు సమస్యలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆమె గర్భాశయ భాగంలో భారీ ట్యూమర్ ఉన్నట్లు తేలడంతో, నిపుణుల బృందం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను చేపట్టింది.
వైద్యుల సమన్వయంతో ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోగి కుటుంబ సభ్యులు ఆమెకు కొత్త జీవితం ఇచ్చిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యులు ఈ కేసును “సవాలుతో కూడినది”గా పేర్కొంటూ, సమిష్టి కృషితో మంచి ఫలితాన్ని సాధించామని చెప్పారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments