న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress 2025) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం డిజిటల్ రంగంలో సాధించిన అద్భుత పురోగతిని వివరించారు.
ఆయన మాట్లాడుతూ –
“ఈరోజు భారతదేశంలో 1 GB మొబైల్ డేటా ధర ఒక కప్పు చాయ్ ధర కంటే కూడా తక్కువగా ఉంది. డేటా ఇప్పుడు విలాసం కాదు, ప్రతి భారతీయుడి జీవితంలో ఒక అవసరమైన భాగమైంది,” అని తెలిపారు.
మోదీ గారు భారతదేశం ప్రపంచంలోనే తక్కువ డేటా ధరలు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, భారత్ ఇప్పుడు “Made in India 4G Stack” అభివృద్ధి చేసిన దేశాల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
భారతీయ టెలికాం రంగం స్వదేశీ సాంకేతికతతో ముందుకు సాగడం దేశానికి గర్వకారణమని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్లు, రోబోటిక్స్ వంటి రంగాల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments