నల్లగొండ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మోసపూరిత వాగ్దానాలతో గద్దె ఎక్కిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల్లో చులకన అయ్యారని ఆయన తెలిపారు. ప్రతి పనికి రేట్లు కట్టి, నక్కలా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. “నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లబ్ధి పొందినవాళ్లే ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారు,” అని భూపాల్ రెడ్డి హెచ్చరించారు.
అధికార పార్టీ నాయకులు రోజూ ప్రజలను దోచుకుంటూ, అభివృద్ధి అనే పేరుతో కబ్జా రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. ఇకపై ప్రజలు మోసపోరని, కులాల విభజనలను పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధించాల్సిందేనని ఆయన హేతుబద్ధంగా చెప్పారు.
ఈ సమావేశంలో కొండూరు సత్యనారాయణ, దేప వెంకటరెడ్డి, గాదె రాంరెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కృష్ణార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై, బీఆర్ఎస్ విజయం కోసం కట్టుబడి పనిచేయాలని సంకల్పించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments