కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ కార్యకర్తల అసంతృప్తి భగ్గుమంది.
33వ డివిజన్లో మైనార్టీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు గళమెత్తారు.
ఈ అంశంపై నల్లగొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి వినతి పత్రాలు అందజేశారు.
ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన మైనార్టీలకు ఈసారి న్యాయం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
33వ డివిజన్లో మైనార్టీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పీసీసీ నాయకత్వాన్ని కోరారు.
ఈ వ్యవహారం నల్లగొండ కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.
చివరకు తమ ఫిర్యాదులను జామియత్ ఉలేమా ఏ హింద్ తెలంగాణ అధ్యక్షులు మౌలానా ఎహేసాన్ ఉద్దీన్ దృష్టికి తీసుకెళ్లిన మైనార్టీ నాయకులు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments